రానా ఒక్కడే ధైర్ఘ్యం చేశాడా ?

‘రుద్రమ దేవి’ సినిమా తర్వాత దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్య కశ్యపుడు’ సినిమా తీసేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇప్పుడా ప్రయత్నాలు ఫలించినట్టుగా చెబుతున్నారు. రానా దగ్గుపాటి లీడ్ రోల్ లో “హిరణ్య కశ్యపుడు” తెరకెక్కనుంది. వచ్చే యేడాది జనవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించనుంది.

ఈ కథని గుణశేఖర్ టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ వినిపించడట. ఐతే, ఎవ్వరు కూడా ‘హిరణ్య కశ్యపుడు’ చేసేందుకు ముందుకు రాలేదు. రానా మాత్రమే ఓకే చెప్పాడు. దీంతో.. గుణశేఖర్ రానాతో హిరణ్య కశ్యపుడు సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. ఈ కథ రానాకు తప్ప మరే హీరోకి నచ్చకపోవడం అసలు కారణాలేంటీ ? అనే చర్చ కూడా ఇండస్ట్రీ మొదలయ్యింది. బాహుశా.. చారిత్రాత్మక చిత్రాల టేస్ట్ రానాకు తెలిసినంత మరే హీరోకి తెలియక కావొచ్చు.