కరోనా విధుల్లో.. హోంగార్డు హఠాన్మరణం !

సిరిసిల్లలో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తూ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య అనే హోంగార్డుహఠాన్మరణం చెందారు. ఆయన హార్ట్ ఎటాక్ వచ్చిందా ? మరో కారణమా ? అన్నది తెలియాల్సి ఉంది.

దేవయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలియజేశారు. వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థికసహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇక కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన పోలీసులు, డాక్టర్లు, స్వచ్ఛ కార్మికులే కనిపించే దేవుళ్లుగా మారారు.