మంద‌కృష్ణ‌కు బెయిల్.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి..!

ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మందకృష్ణ మాదిగకు ఎట్ట‌కేల‌కు బెయిల్ మంజూరైంది. భార‌తి మాదిగ సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఛ‌లో ట్యాంక్ బండ్ కు పిలుపునిచ్చిన మంద కృష్ణ మాదిగ‌. ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణమైన మంద‌కృష్ణ‌తో పాటు మ‌రికొంత‌మందిని పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

చంచ‌ల్ గూడ జైలులో ఉన్న మంద‌కృష్ణను విడుద‌ల చేయాలంటూ ప్ర‌జాసంఘాలు, విప‌క్ష పార్టీల నేత‌ల‌తో పాటు ఎమ్మార్పీఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మంద‌కృష్ణ‌కు బెయిల్ మంజూరయింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరుచేసింది. ప్ర‌తీ పదిరోజులకోసారి కార్ఖాన,రాంగోపాల్ పేట్ పీఎస్ లో హాజరుకావాలని షరతు విధించింది. ఇద్దరు వ్యక్తులతో పదివేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.