బోర్డర్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో

కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మనదేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. దాన్ని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడగించారు. ఈ నేపథ్యంలో సామాన్యులు, సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. అయితే కన్నడ స్టార్ కిచ్చ సుధీప్ మాత్రం శ్రీనగర్ బోర్డర్ లో లో విహరిస్తున్నారు. 

దానికి సంబంధించిన వీడియోని ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. శ్రీనగర్ లో మూడో రోజు కొత్త ముఖాలు.. కొత్త ప్రదేశాలు అంటూ కొన్ని కాల్వలు, నదలు పక్కన దిగిన ఫొటోలతో పాటు అక్కడ స్తానికులతో దిగిన ఫొటోల వీడియోను షేర్ చేశాడు సుధీప్. కరోనా కలవరంలోనూ సుధీప్ ఇంత స్వేచ్ఛగా, హాయిగా ఎలా షూటింగ్ లో పాల్గొంటున్నారన్నది అర్థంకాని విషయం.