బద్రీపై పవన్ నో కామెంట్

‘బద్రీ’ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వెరీ స్పెషల్. ఈ సినిమాతోనే రేణూ దేశాయ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పవన్ తో ప్రేమలో పడ్డారు. ఆయనతో చాన్నాళ్లు సహజీవనం చేశారు. ఫైనల్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బద్రీ సినిమాకి సంబంధించి పవన్ కి బోలేడు తీపి జ్ఝాపకాలు ఉండాలి.

సోమవారంతో బద్రీ సినిమా 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆనాటి జ్జాపకాలని రేణుదేశాయ్ గుర్తు చేసుకున్నారు. ‘హే చికీతా` సాంగ్ షూటింగ్ కోసం కేప్‌టౌన్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లాం. అక్కడ కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా ఉండేవి కావు. నేను షార్ట్ స్కర్ట్ వేసుకొని ఉండడం వల్ల రాళ్ల మీద కూర్చునే వీలుకాలేదు. `ఓ అమ్మాయి నిల్చుని ఉంటే మీరలా కూర్చోవడం పద్ధతి కాద`ని నేను కల్యాణ్‌గారితో జోక్ చేసేదాన్ని’ అంటూ బద్రీ జ్ఝాపకాలని నెమరు వేసుకున్నారు. పవన్ మాత్రం అసలు బద్రీని పట్టించుకోలేదు. 

సోషల్ మీడియా వేదికగా సోమవారం పలు విషయాలపై స్పందించిన పవన్.. బద్రీ సినిమాపై చిన్ని ట్విట్ కూడా చేయలేదు. ఒకవేళ బద్రీ సినిమాపై స్పందిస్తే.. రేణు దేశాయ్ గురించి చెప్పాలి. అది ఇష్టం లేకే పవన్ బద్రీపై కామెంట్ చేయలేదేమో.. ! ఇక బద్రీ దర్శకుడు పూరి జగన్నాథ్ తొలి సినిమా కావడంతో.. ఆయన సినీ ప్రముఖులు, ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెలువెత్తాయి. వాటికి ఓపికగా థ్యాంక్స్ చెప్పారు పూరి.