భారత్ కు విజయ్ మాల్యా వచ్చేది ఎప్పుడంటే ?

సుమారు 17 బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల కుచ్ఛు టోపీ పెట్టి బ్రిటన్ చెక్కేసిన విజయ్ మాల్యాని భారత్ తీసుకొచ్చేందుకు మార్గం మరంత సుగుమం అయింది. తనను భారత్ కు అప్పగించరాదంటూ మాల్యా చేసుకున్న పిటిషన్ ను లండన్ హైకోర్టు సోమవారం కొట్టేసింది.

ఈ తీర్పుపై బ్రిటన్ సుప్రీంకోర్టుకు అపీలు చేసుకునేందుకు 14 రోజుల గడువిచ్చింది. సుప్రీం కోర్టుకు మాల్యా అపీలు చేసుకుంటే అక్కడ తీర్పు వెలువడే వరకూ ఆయన అప్పగింతపై బ్రిటన్ అంతర్గత వ్యవహారాల విభాగం వేచి చూస్తుంది. అపీలు చేసుకోని పక్షంలో భారత్ బ్రిటన్ మధ్య గల నేరస్థుల అప్పగింత ఒప్పందం మేరకు 28 రోజుల్లో మాల్యా అప్పగింతకు తగిన చర్యలు తీసుకోనుంది.