రొమాంటిక్ పాత్రలో నిహారిక


కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సినీతారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయంలోనూ అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సరదా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. తాజాగా మెగా హీరోయిన్ నిహారిక, యాంకర్‌ రవితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడారు.

పెళ్లి తర్వాత కూడా నటించడంపై నిహారిక స్పందించింది. ‘నేను సమంత కాదు. కాబట్టి పెళ్లి తర్వాత నటిస్తానా? నటించలేనా? అనే విషయాన్ని ముందుగానే చెప్పలేను. కాబట్టి నాకు ఎక్కువ సమయం లేదు. వీలైనంత వరకు ఇప్పటి నుంచి నా వద్దకు వచ్చిన మంచి ఆఫర్లను వదిలిపెట్టకుండా నటిస్తా’నని తెలిపింది.

గ్లామర్ పాత్రలు చేయకపోవడంపై నిహారిక వివరణ ఇచ్చింది. ‘గ్లామరస్‌ పాత్రలు కూడా పోషించబోతున్నా. నా తర్వాతి తమిళ ప్రాజెక్టు రొమాంటిక్‌ చిత్రంగా రూపుదిద్దుకోబోతోంది. గోవాలో ఈ సినిమా షూటింగ్‌ జరగబోతోంది. ఈ సినిమా కోసం గోవా బీచ్‌లో రొమాంటిక్‌ సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నాం’ అని తెలిపింది నిహారిక.

మెగా హీరోల లిస్ట్ పెద్దదే. కానీ మెగా హీరోయిన్ మాత్రం ఒక్కరే. నిహారిక. ‘ఒక మనసు’ సినిమాతో తెరకు పరిచయం అయింది. ఆపై ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సుర్యకాంతం’లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఆశించిన విజయం తీసుకురాలేదు. ‘సైరా నరసింహారెడ్డి’లో చిన్న పాత్రలో మెరిసింది. ‘ఆచార్య’ సినిమాలోనూ నిహారిక గెస్ట్ రోల్ లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.