పవన్ ప్రతిరోజూ 600కి.మీ ప్రయాణించేవారు !

అభిమానుల కోరికని తీరిస్తూ పవర్ స్టార్ పవన్  కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ షూటింగ్ ప్రారంభం అయింది. తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ సమయంలో పవన్ ప్రతిరోజూ 600కి. మీ పయణించేవారట. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు వేణు శ్రీరామ్  తెలిపారు.

దాదాపు 22 రోజులపాటు పవన్ విజయవాడ టు హైదరాబాద్‌, హైదరాబాద్‌ టు విజయవాడ ప్రయాణించారని, ప్రతి రోజూ 600 కిలోమీటర్లు ట్రావెల్‌ చేసేవారని వేణు శ్రీరామ్ తెలిపారు.  ఒక్క రోజు కూడా షూట్‌ను మిస్‌ చేయలేదంటూ పవన్ అంకితభావాన్ని ప్రశంసించారు. సినిమాకు సంబంధించిన ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయిందని తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత మిగిలిన భాగం షూటింగ్‌ కూడా పూర్తి చేస్తామని తెలిపారు.

హిందీ హిట్‌ ‘పింక్‌’కు తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. అంజలి, నివేదా థామస్‌, అనన్యా నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, నరేష్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని అతిథి పాత్రలో ఇలియానా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.