మహేష్-సితార.. మరో పిక్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో గడుపుతుంటారు. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ఇంట్లోనే ఉంటూ పిల్లలతో ఆడుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మహేష్.

తాజాగా కూతురు సితార కలిసి దిగిన ఓ సెల్ఫీ పిక్ ని మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడీ పిక్ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ తదుపరి సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారమ్. ఎమోషన్స్ కి పెద్దపీఠ వేస్తూ.. ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథని మహెష్ కోసం రాసుకొన్నాడట పరశురామ్. గీత గోవిందం తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది.