మహేష్ కి నో చెప్పిన సాయి పల్లవి

సూపర్ స్టార్ మహేష్ బాబు వెంటపడే ఛాన్స్ వచ్చిందంటే అది అదృష్టంగా భావిస్తారు ముద్దుగుమ్మలు. యంగ్ హీరోయిన్ రష్మిక మందన మహేష్ వెంటపడింది. ‘హీ ఈజ్ సో క్యూట్.. ‘ అంటూ పాటేసుకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్-రస్మిక జంటగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు సూపర్ హిట్ అయింది.

ఈ సినిమా కోసం హీరోయిన్ గా ముందుగా సాయి పల్లవిని అనుకున్నారంట. ఆమెని దృష్టిలో పెట్టుకొనే దర్శకుడు అనిల్ రావిపూడి హీరోయిన్ పాత్రని డిజైన్ చేశారట. ఆమెని కలిసి కథని కూడా వినిపించారు. అయితే సాయి పల్లవి నో చెప్పేసింది. ఎందుకంటే ? సెకాంఢాఫ్ తాను హీరో వెనకాల నిల్చోవడం తప్ప చేసేదేమీ లేదు. వేరే హీరోయిన్స్ కూడా చేయగలరు అనే పాత్రలని నేను చేయను. నేను మాత్రమే చేయగలనే పాత్రల్లో మాత్రమే నటిస్తానని చెప్పిందట. ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రమిది. నాగ చైతన్య హీరో.