కేటీఆర్’కి చెక్ అందజేసిన రాజశేఖర్ కూతుళ్లు

కరోనా సాయం చేసేందుకు ముందుగా ముందుకొచ్చిన వారిలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒకరు. ఆయన మొదటి నుంచి సినీ కార్మికులకి తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా రాజశేఖర్ కూతుళ్లు మంత్రి కేటీఆర్ ని కలిసి రూ.2లక్షల చెక్ అందించారు. 

రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా శివాణి, శివాత్మిక చెరో రూ.లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వానికి కరోనా విరాళం అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శివాణి, శివాత్మిక మంత్రి కేటీఆర్ ని కలిశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు బాగున్నాయని ఈ సందర్భంగా శివాత్మిక కితాబిచ్చింది.

ఇక రాజశేఖర్ కూతుళ్లు ఇద్దరు హీరోయిన్స్ రాణించాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగమార్తాండలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శివాణి-అడవి శేష్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది.