25 మంది పోలీసులని క్వారంటైన్ కి తరలింపు

ఏపీ పోలీసుల్లో కరోనా కలవరం మొదలైంది. ఇటీవల విజయవాడ మహిళా పోలీస్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలీస్ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. సదరు మహిళను ఆస్పత్రికి తరలించినవారితోపాలు మొత్తం 25మంది పోలీసులను క్వారంటైన్‌కు తరలించారు.

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 60 కొత్త కేసులు నమోదు కాగా.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 821కు చేరింది. కొత్తగా గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లా 19, చిత్తూరు జిల్లా 6, కడప జిల్లా 5, ప్రకాశం జిల్లా 4, కృష్ణా జిల్లాలో 3, అనంతపురంలో 8కేసులు నమోదయ్యాయి.