రాజమౌళిపై మిఠాయి దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలన్నీ కాపీ కథలేనని సంచలన కామెంట్స్ చేశాడు మిఠాయి దర్శకుడు ప్రశాంత్ కుమార్. ఆస్కార్ విన్నింగ్ సినిమా ‘పారాసైట్’ తనకు నచ్చలేదు. సినిమా చూస్తున్నప్పుడు నిద్ర వచ్చేసిందని రాజమౌళి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మిఠాయి దర్శకుడు స్పందించారు. ఓపెన్ లెటర్ రాశారు.

“పారాసైట్ చిత్రం వాస్తవికతకి అద్దం పట్టేలా ఉంది. ప్రత్యేకించి భాషా అడ్డంకులను అధిగమించేంత శక్తివంతమైనదిగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా బాలేదని రాజమౌళి అనడం ఏ మాత్రం బాగోలేదు. అందుకే ఈ లెటర్ రాస్తున్నా. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ సై సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేశారు. సైతో పాటు మీరు తీసిన చాలా చిత్రాలు కూడా కాపీలే. పబ్లిక్ ప్లాట్‌ఫాంలో పారాసైట్ లాంటి చిత్రాన్ని మీరు కించపరచడం ఏ మాత్రం బాగోలేదు. సినిమా చూడాలంటే నిర్ధిష్ట మానసిక స్థితి మరియు మనస్సు అవసరం. మీరు ఆ మానసిక స్థితిలో లేరని నేను భావిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. మరీ.. దీనిపై రాజమౌళి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందా ? అనేది చూడాలి.