అనసూయ.. ఆ కష్టాలు పడలేదట !

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయి. దీంతో సినీ తారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయంలో నెటిజన్లతో సరదాగా ముచ్చటిస్తున్నారు. తాజగా హాట్ యాంకర్ అనసూయ ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #askAnasuya పేరుతో నిర్వహించిన ఈ ట్విటర్‌ ఛాటింగ్‌లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది.

“టీవీ రంగంలోకి అడుగుపెట్టే సమయంలో, ఆ తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ? అని ఓ నెటిజన్ అడగగా..  ‘మీరు ఏమైతే ఊహించుకుంటున్నారో అలాంటి కష్టాలు నేను ఎదుర్కొనలేదు. ఎందుకంటే నాకు అలాంటివి నచ్చవు’ అని అనసూయ సమాధానమిచ్చింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నానని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చింది.

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాతో పాటుగా అల్లు అర్జున్-సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లోనూ అనసూయకి కీలక పాత్రలు దక్కాయనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందాల నుంచి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.