మహేష్’కు సితార హెడ్ మసాజ్ 

కరోనా లాక్‌డౌన్ తో సినీతారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాన్ని సూపర్ స్టార్ మహేష్ పిల్లలతో గడుపుతున్నారు. వారితో కలిసి సినిమాలు చూస్తున్నారు. ఆడుకుంటున్నారు. కొట్టుకొంటున్నారు. ఇప్పటికే కూతురు సితార కలిసి చేసిన సరదా పనులకి సంబంధించిన ఫోటోలు, వీడియోలని మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

తాజాగా సితార మహేష్ కి హెడ్ మసాజ్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలని మహేష్ భార్య నమ్రత తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ”ఒక పక్క జీజీ(గౌతమ్ ఘట్టమనేని) గేమ్ ఆడటం చూస్తున్నాం. మరో వైపు మాత్రం మహేశ్కు హెడ్ మసాజ్ చేయడానికి వాలంటీర్ దొరికింది. రెండు నిమిషాల్లో పని పూర్తి చేసింది” తెలిపింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్. ఆయన తదుపరి సినిమా పరశురామ్ దర్శకత్వంలో ఉండనుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. భాగోద్వేగాలు బలంగా ఉంటాయని చెబుతున్నారు. మహేష్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఫిక్సయింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్ తో సినిమా ఉంటుందని  రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.