తెలంగాణలో కరోనా కొత్త కేసులు 7 మాత్రమే

తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వస్తోంది. రోజురోజూకి కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈరోజు కొత్తగా 7 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1016కు చేరింది. ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు.

మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది. ఈ ట్రెండు బట్టీ చూస్తే అతి త్వరలోనే కరోనా ఫ్రీ తెలంగాణని చూడొచ్చు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కొత్తగా ఢిల్లీ మర్కజ్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటే.. తెలంగాణలో కరోనా దాదాపు కంట్రోల్ లోకి వచ్చినట్టే.