రిషీ కపూర్ మృతిపై టాలీవుడ్ సంతాపం

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూశారు. రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన ఈ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే ప్రాణాలు విడిచే చివరి క్షణం వరకు చాలా సరదాగా మాట్లాడరని డాక్టర్లు చెప్పారు. రిషీ కపూర్ మృతిపై సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సోషల్ మీడియా వేదికగా రిషి కపూర్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్ తదితరులు రిషీ కపూర్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

చిరంజీవి : ‘రిషీ కపూర్ ఇక లేరని తెలిసి చాలా బాధపడ్డా. ఆయన గొప్ప స్నేహితుడు, గొప్ప నటుడు, ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న వ్యక్తి. గొప్ప వారసత్వానికి వారధి. ఈ నష్టం నా గుండె పగిలేలా చేసింది. గుడ్‌బై మై ఫ్రెండ్. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్విట్ చేశారు.

మోహన్ బాబు :  ‘మన సినీ పరిశ్రమకు ఇది చీకటి వారం. పూడ్చలేని నష్టాలు. దిగ్గజ రిషీ కపూర్, ప్రతిభావంతుడైన ఇర్ఫాన్ ఖాన్ దూరమయ్యారు. గొప్ప విషాదం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’

వెంకటేష్ : ఇద్దరు గొప్ప ప్రతిభావంతులను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం బాధాకరం. చిన్నపిల్లడిలాంటి రిషీ కపూర్ మనస్తత్వం, ఆయన నవ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతాయి. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మీ మరణం మా కుటుంబానికి కూడా తీరని నష్టం. కపూర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి

మహేష్ బాబు : ప్రపంచ సినిమాకు మరో పూడ్చలేని నష్టం. రిషీ కపూర్ మరణ వార్త నన్ను కలిచివేసింది. నిజమైన లెజెండ్, అద్భుతమైన ప్రతిభ గల నటుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. రిషీ కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలి

రామ్ చరణ్ : ‘లెజెండరీ నటుడు రిషీ కపూర్ మరణం అత్యంత విచారకరం. భారతీయ సినిమాకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి – పవన్ కల్యాణ్రిషీ కపూర్ మరణం నన్ను కలిచివేసింది. భారతీయ సినీ పరిశ్రమ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’