పుష్ప.. ఐటమ్ దొరికింది !


అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన సగం ట్యూన్స్ రెడీ చేశారు. ఇక ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. ఈ సాంగ్ లో చిందేయడానికి బాలీవుడ్ హీరోయిన్ ని ట్రై చేస్తున్నారనే వార్తలొచ్చాయ్.

లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? పుష్ప ఐటమ్ దొరికేసింది. లోఫర్ భామ దిశా పటానీని తీసుకున్నారని తెలుస్తోంది.  ఇప్ప‌టికే దిశాని చిత్రబృందం సంప్ర‌దించింది. ఆమె కూడా ఓకే చెప్పిందని తెలుస్తొంది. పాన్ ఇండియా సినిమాగా పుష్ప రాబోతుంది. పలువురు బాలీవుడ్ నటీనటులు పుష్పలో మెరవబోతున్నట్టు సమాచారమ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది.