మహేష్ సినిమాపై పరశురామ్ ప్రకటన

ఈ యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్. ఆయన తదుపరి సినిమా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఉండాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు వినిపించాయి. అదే సమయంలో పరశురామ్ దర్శకత్వంలో మహెష్ తదుపరి సినిమా రాబోతుందనే వార్తలొచ్చాయ్.

తాజాగా ఈ సినిమాపై పరశురామ్ స్పందించారు.  “మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన ఒక్కడు సినిమా నేను తెలుగు సినీ పరిశ్రమవైపు అడుగులు వేసేలా చేసింది. మహేశ్ బాబు సర్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచే అనుకుంటున్నాను. ఇప్పటికీ నా కల నేరవేరుతోంది. ఓ అద్భుతమైన కథతో మేము మీ ముందుకు రానున్నాం” అన్నారు.