మహేష్ కి నో చెప్పిన వసుమతి

సూపర్ స్టార్ మహేష్ బాబుకి అర్జెంటుగా ఓ హీరోయిన్ అవసరం. అది కూడా బాలీవుడ్ హీరోయిన్ కావాలి. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఫిక్సయిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే నటీనటుల ఎంపికని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ముందుగా హీరోయిన్ ఓకే అయితే.. మిగిలిన వారి గురించి ఆలోచించవచ్చని పరశురామ్ భావిస్తున్నారు. 

బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని ఫిక్సయిన పరశురామ్.. ఆల్రెడీ భరత్ అను నేను సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేసిన కైరా అద్వానీ ట్రై చేశారు. ఆమెని సంప్రదించారు. మహేష్ సినిమా అని చెప్పారు. పాత్ర బాగుంటుందని కన్విన్స్ చేశారు. అయినా.. కైరా నో చెప్పింది. కైరాకు మహేష్ తో కలిసి మరోసారి నటించాలని ఉంది. కానీ ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో బిజీ. కబీర్ సింగ్ తర్వాత బాలీవుడ్ లో కైరా కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అందుకే మహేష్ సినిమా చేయలేనని సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది.

ప్రస్తుతం కైరా అక్షయ్ హీరోగా వస్తున్న లక్ష్మీ బాంబ్, ఇందూ కి జవానీ అనే చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలలో నటిస్తుంది. ఇక మహేష్-పరశురామ్ సినిమా కోసం మొదటి ఆప్షన్ గా కైరాని అనుకున్నారు. ఆమెకి కుదరని చెప్పేసింది. దీంతో సారా అలీఖాన్, జాన్వీ కపూర్ లని కూడా అడిగి చూడబోతున్నారని తెలుస్తోంది.