‘ఆచార్య’ నుంచి కాజల్ అవుట్

మెగాస్టార్ చిరంజీవి సైతం హీరోయిన్ సమస్యని ఎదుర్కొంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్ గా త్రిషని తీసుకున్నారు. ఆమె షూటింగ్ లో జాయింది. ఇంతలో సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్ చేసింది. క్రియేటివ్ డిఫరెన్స్ వలనే సినిమా నుంచి తప్పుకుంటున్నాని తెలిపింది. దీంతో ఆమె స్థానంలో కాజల్ ని తీసుకున్నారు. 

ఇప్పుడు కాజల్ కూడా ఆచార్య నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. కారణాలేంటీ అంటే.. ? కరోనా అంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్స్ రద్దయిన సంగతి తెలిసిందే. కాల్షీట్ల సమస్య నెలకొంది. ఆచార్యకి కేటాయించిన డేట్స్ లాక్‌డౌన్ కారణంగా వృధా అయిపోవడంతో తాను ఈ ప్రాజెక్ట్‌లో నటించలేనని కాజల్ తేల్చిచెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.