ఆ మజానే వేరు : రోహిత్

మైదానంలోకి దిగితే ఆ మజానే వేరు అంటున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రోహిత్.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకి వినోదం పంచుతున్నారు. తాజా, మాజీ ఆటగాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఆ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

తాజాగా రోహిత్.. ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్‌లీతో లైవ్ చాట్ నిర్వహించారు. “ముంబైలో సొంత ప్లాట్ ఉండటం చాలా గొప్ప విషయం. నేను ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా. బాల్కానీలో ప్రాక్టీస్ చేసేందుకు కాస్త స్థలం ఉంది కానీ అది నెట్ ప్రాక్టీస్‌కు సరిపోయేంతగా లేదు. ఏదేమైనా మైదానంలో దిగి ఆడిన మజానే వేరు. లాక్‌డౌన్ కారణంగా క్రికెట్‌ను చాలా మిస్సవుతున్నా. ఎప్పుడెప్పుడూ గ్రౌండ్‌లో అడుగుపెట్టి భారీ సిక్సర్లు బాదాలా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా”నన్నారు హిట్‌మ్యాన్.