‘కేబీసీ-12’పై అమితాబ్ ప్రకటన 

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అభిమానులకి గుడ్ న్యూస్. కేబీసీ-12పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బుల్లితెరపై సంచలనం సృష్టించిన క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి విజయవంతంగా 11 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ 11 సీజన్స్ కి బిగ్ బీ అమితాబ్ నే2 హోస్ట్‌గా  వ్యవహరించారు. తాజాగా కేబీసీ-12 సంబంధించి అధికారిక ప్రకటన చేశారు బిగ్ బీ. ఈ మేరకు ఓ వీడియో ని విడుదల చేశారు.

“మన జీవితంలో ప్రతిదానికి ఒక బ్రేక్ ఉంటుంది. కానీ కలలకి కాదు. మీ కలలకి రెక్కలు అందించేందుకు అమితాబ్ బచ్చన్ కేబీసీ 12తో బుల్లితెరపై రాబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మే 9న రాత్రి 9గం.ల నుండి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్‌లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి” అని అమితాబ్ తెలిపారు.