రైతుల ఖాతాల్లో రూ. 25 వేలు

తెలంగాణలో నడుస్తోంది రైతు రాజ్యం. ఈ మాట పదే పదే చెప్పే సీఎం కేసీఆర్.. రైతులకి ఎలాంటి కష్టాలు రాకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రూ. 25వేల లోపు రుణం ఉన్న రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. తాజాగా దానికి సంబంధించి రూ. 1200కోట్లు విడుదల చేశారు. వెను వెంటనే రైతు ఖాతాల్లో రుణ మాఫీ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించారు.

ఇక రూ. 25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణ చెల్లింపులు జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులని ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకరాం ఇతర ఖర్చులు తగ్గించుకోనైనా రైతులు పంటలు వేసే సమయానికన్నా ముందే రైతుల ఖాతాలలో డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ఆదేశాలిచ్చారు.