తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ?

కరోనా ప్రభావంతో వాయిదా పడిన పరీక్షలని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పరీక్షలు, ఇంటర్‌ మూల్యాంకనంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 12 నుంచి మూల్యాంకనం ప్రక్రియ మొదలుపెడతామని మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా నిలిపివేసిన పదోతరగతి పరీక్షలను హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని చెప్పారు.