విశాఖ బాధిత కుటుంబాలకి రూ. కోటి పరిహారం 

విశాఖ గ్యాస్‌ లీక్ బాధితులని సీఎం జగన్ పరామర్శించారు. ఆ వెంటనే బాధిత కుటుంబాలకి ప్రభుత్వం తరుపున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

వెంటిలేటర్‌ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ. 10 లక్షల పరిహారం, రెండు నుంచి మూడు రోజల పాటు ఆస్పత్రిలో ఉన్నవారికి లక్ష రూపాయలు,  స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ. 25వేలు, ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10 వేలు చొప్పున సాయం చేస్తామని సీఎం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం వచ్చేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఓ కమిటిని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.