‘అజ్ఝాతవాసి’లో సునీల్ ఉన్నాడు. కానీ.. లేడు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఝాతవాసి”గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే యేదాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హీరోగా ఫెయిల్ అవుతున్న స్నేహితుడు సునీల్’కు ‘అజ్ఝాతవాసి’లో అవకాశం ఇచ్చాడు దర్శకుడు త్రివిక్రమ్. సునీల్ కోసం తనదైన స్టయిల్’లో స్పెషల్ ట్రాక్ రాశాడు. సునీల్ కూడా సంతోషంగా షూటింగ్’లో పాల్గొన్నాడు. తన పాత్ర సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశాడు.

ఇప్పుడు ‘అజ్ఝాతవాసి’ ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. ఈరోజే సెన్సార్ ముందుకు వెళ్లనుంది. ఐతే, సినిమాలో సునీల్ పాత్ర లేదు. ఆ ట్రాక్ ని మొత్తానికే లేపేశారు. ఈ విషయం సునీల్’కు తెలుసు. దీనికి కారణం సునీల్ కోసం త్రివిక్రమ్ రాసుకొన్న స్పెషల్ ట్రాక్ అనుకొంత స్థాయిలో రాలేదట. దీంతో.. ఆ ట్రాక్ ని మొత్తానికే లేపేశారు. సునీల్ కూడా ఎన్ టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో నటిస్తానని లైట్ తీసుకొన్నాడట. సో.. పవన్ ‘అజ్ఝాతవాసి’లో సునీల్ కనిపించడం లేదు.

ఇక, ‘అజ్ఝాతవాసి’లో పవన్ సరసన కీర్తి సురేశ్, అను ఇమాన్యూయేల్ లు జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథాకృష్ణ నిర్మాత.