అన్ని జోన్లలోనూ మాస్క్ మస్ట్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా మాస్క్ తప్పనిసరి చేసింది. అంతేకాదు.. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని జీవో జారీ కూడా చేసింది. 

మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వస్తే జరిమానా తప్పదు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే కఠిన చర్యలు తప్పవు. కేవలం రెడ్ జోన్లలో మాత్రమే కాదు. ఆరేంజ్, గ్రీన్ జోన్లలోనూ మాస్క్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు సడలింపులతో కూడిన లాక్ డౌన్ పొడిగింపు జీవోను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక తెలంగాణలో లాక్ డౌన్ ఈ నెల 28 వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే.