మాస్క్ ధరించలేదని.. 5వేల జరిమానా !

మాస్క్ మస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. నో మాస్క్ నో లిక్కర్ అనే నినాదాన్ని ఇచ్చింది. మాస్క్ లేకుండా వచ్చిన వ్యక్తిని మద్యం అమ్మితే.. మద్యం షాపుకి భారీ జరిమానా తప్పదని హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాస్క్‌ లేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు.. ఒక  వైన్స్‌ షాపుకుకు రూ. 5 వేల జరిమానా విధించారు.

మంచిర్యాల జిల్లాలో మాస్క్‌ లు లేకుండా తిరుగుతున్నవారికి శ్రీరాంపూర్‌ పోలీసులు రూ.1000 ఫైన్‌ వేశారు. చెన్నూర్‌ నియొజకవర్గ కేంద్రంలో ఉదయం మార్కెట్‌ లో మాస్క్‌ ధరించకుండా కూరగాయలు అమ్ముతున్నందుకు మున్సిపల్‌ అధికారులు రూ. 500ఫైన్‌ వేశారు. మొత్తంగా తెలంగాణలో మాస్క్ ఫైన్లు భారీగానే పడుతున్నాయి.