దండకారణ్యంలో ఎన్ కౌంట‌ర్ : ఎస్సై, నలుగురు నక్సలైట్స్ మృతి


ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఓ సబ్ ఇన్సెక్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపైకి ఎదురుకాల్పులు చేపట్టారు.

మావోలు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సైని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలోనే ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలంలో ఏకే -47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్, రెండు 315 బోర్ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.