కరోనా సోకిన అభిమానికి ధైర్యం చెప్పిన శింబు

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన సినీ తారలు బాధ్యతగా వహిస్తున్నారు. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలు ఇచ్చారు. సినీ కార్మికులని ఆదుకున్నారు. తాజాగా తమిళ్ హీరో శింబు కరోనా సోకిన అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు.

శింబు అభిమాని ఆనంద్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. త‌న అభిమానికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలుసుకున్న శింబు అత‌నికి ఫోన్ చేసి ధైర్యం అందించారు. ఎట్టిప‌రిస్థితుల‌లోను ధైర్యాన్ని కోల్పోవ‌ద్ద‌ని సూచించారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్ధిస్తాను అని తెలిపారు.