మన్మోహన్ సింగ్’కు అస్వస్థత.. ఎయిమ్స్’లో చేరిక !

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ కు ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే  ఉన్నట్టు తెలుస్తోంది. గుండె చికిత్స విభాగంలో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ పర్యవేక్షణలో ఉన్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సమయంలోనే మన్మోహన్ సింగ్ కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వ్యక్తిగత వైద్యులు సూచించారు. 2009లోనూ మన్మోహన్ సింగ్ కు ఎయిమ్స్ లో బైపాస్ సర్జరీ జరిగింది. భారత్ లో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. యూపీఏ1, యూపీఏ2లోనూ ఆయన ప్రధానిగా సేవలందించారు.