ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా.. స్టోరీ లైన్ ఇదేనా ?

ప్రస్తుతం ప్రభాస్ రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండనుంది. ఇదికూడా పాన్ ఇండియా సినిమానే. ఇప్పుడీ సినిమా స్టోరీ లైన్ లీకైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. ? ఇది ఓ సోసియో ఫాంటసీ మూవీ. సామాన్య మానవుడు, దేవకన్యకు పుట్టిన ఓ వన్దర్ కిడ్ స్టోరీనే ఇది. ఒకానొక చిత్రమైన పరిస్థితిలో సాధారణమైన మానవుడికి, దేవకన్యకి జన్మించిన బిడ్డ.. పెరిగి పెద్దయ్యాక ఎలాంటి అద్భుతాలు చేస్తాడనే లైన్ తో సినిమా ఉండనుందని చెప్పుకొంటున్నారు. ఇప్పటికి మాత్రం ఇది ప్రచారం మాత్రమే. ఇదే నిజమైనా.. స్టోరీ అద్భుతంగా ఉందని ప్రభాస్ అభిమానులు మురిసిపోతున్నారు.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత అశ్వినీదత్ ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాపై స్పందించారు. నాగ్ అశ్విన్ కథ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ కావాలన్నాడు. అతను అయితేనే సినిమాకి న్యాయం చేయగలడు అన్నాడు. ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవసర. అద్భుతంగా ఉంటుంది. అంత బడ్జెట్ తీసుకొచ్చే స్టామినా ప్రభాస్ కి ఉందని చెప్పుకొచ్చాడు.