త్రిషకి మరో అవకాశం ఇచ్చిన మెగాస్టార్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’. ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్ గా త్రిషని తీసుకున్నారు. అయితే ఆమె సడెన్ గా సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలనే సినిమా నుంచి బయటికొచ్చినట్టు తెలిపారు. అయితే అసలు విషయం అది కాదు. ఆమెకి మణిరత్నం సినిమా ఆఫర్ రావడంతో.. మా సినిమా నుంచి తప్పుకుందని తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటన చేశారు.

అంతేకాదు.. త్రిషపై ఎలాంటి కోపం పెట్టుకోకుండా.. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా చిరు విషెస్ తెలిపారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? త్రిషకి మెగాస్టార్ మరో అవకాశం ఇచ్చారట. ‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ ‘లూసిఫర్’ రీమేక్‌ లో నటించనున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ త్రిష అయితే బాగుంటుందని భావిస్తున్నారట. త్వరలోనే త్రిషని కలిసి లూసిఫర్ సినిమా కోసం ఒప్పించే ప్రయత్న చేస్తారని ఇండస్ట్రీ వర్గాల టాక్.