స్టార్ హీరోయిన్ బయోపిక్ ప్లాన్ చేసిన పూరి

బాలీవుడ్, టాలీవుడ్ లోనూ బయోపిక్ ల హవా నడుస్తోంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ ఓ బయోపిక్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా ఓ స్టార్ హీరోయిన్ బయోపిక్ అని తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ఆ తర్వాత ఐటమ్ భామగా మారి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ జీవిత కథ ఆధారంగా పూరి కథని రెడీ చేశాడట.
 
ఛార్మీ ప్రధాన పాత్రలో ఈ బయోపిక్ ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో పూరి ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా పూరి సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు. తనదైన శైలిలో ఫటాఫట్ గా కంప్లీట్ చేయనున్నాడు. అతి తక్కువ బడ్జెట్, అతి తక్కువ రోజుల్లో.. ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు సమాచారమ్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇస్మార్ట్ శంకర్ తో తన మార్క్ చాటిన పూరి ప్రస్తుతం ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. కరోనా ప్రభావంతో.. ఫైటర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ ప్రభావం తగ్గాక తిరిగి ప్రారంభం కానుంది.