ఓటీటీలో మరో బాలీవుడ్ సినిమా

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ మూతపడ్డాయి. మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా థియేటర్స్ బంద్ అయ్యాయ్. తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయి అన్నది తెలీదు. ఈ నేపథ్యంలో ఓటీటీ మాధ్య‌మాల‌తో ఒప్పందం కుదుర్చుకొని త‌మ సినిమాల‌ని డిజిట‌ల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేస్తున్నాయి.ఇప్ప‌టికే బాలీవుడ్ సినిమా ‘గులాబో సితాబో’ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12న అమెజాన్‌లో ‘గులాబో సితాబో’ విడుద‌ల కానుంది.

తాజాగా మరో బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన  ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శకుంతలా దేవి బ‌యోపిక్‌లో విద్యా బాల‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి అను మీనన్ దర్శకత్వం వహించారు. లెడ్ అబుందంటియా ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో విక్రమ్ మల్హోత్రా నిర్మించారు. థియేటర్స్ లోనే ‘శుకుంతలాదేవి’ ని విడుదల చేయాలని భావించినా.. లాక్‌డౌన్ తో థియేటర్స్ ఇప్పట్లో తెరచుకొనే పరిస్థితులు లేనందున ఓటీటీ రిలీజ్ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది.