ఖుష్భూ.. ఓ బ్రోకర్ !

ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని హేళన చేసిన సీనియర్ హీరోయిన్ ఖుష్భూపై విమర్శలొస్తున్నాయ్. ఖుష్బూ.. ఓ బోకర్ అంటూ తీవ్ర విమర్శ చేసింది నటి, బీజేపీ సభ్యురాలు గాయత్రి రఘురామ్. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తీరుపై కుష్బూ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మోదీ ప్రసంగం మొత్తం హిందీలోనే సాగింది. ఇండియాలో ప్రాచీన భాష అయిన తమిళంలో ఆయన ఎందుకు మాట్లాడలేదని ఖుష్భూ ప్రశ్నించారు.

అయితే ప్రధాని ప్రసంగంపై ఖుష్భూ చేసిన వ్యాఖ్యలని ఎవరు సమర్థించలేదు. పైగా ఆమె తన స్థాయికి దిగజారి కామెంట్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే.. గాయత్రి గుప్తా ఏకంగా ఖుష్భూ.. ఓ బ్రోకర్ అనేసింది. ఈ వ్యాఖ్యలపై ఖుష్బూ సీరియస్ అయితే.. ఈ వివాదం మరింత ముదిరినట్టే.