మానుకో క‌డియం… !!

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్‌. వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కడియం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. మోడీ సమయం ఇవ్వడం లేదన్న క‌డియం ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఖండించారు.

దళితుల మీద టీఆర్ఎస్ కు ఎంత ప్రేమ ఉందోఈ మూడేండ్ల పాలన లోనే తెలుస్తోందని, ప్ర‌భుత్వం దళితులకు కేటాయించిన బడ్జెట్ లో ఎంత ఖ‌ర్చు చేసిందో ముందు చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. కొరల్లేని సబ్ ప్లాన్ చట్టం న‌డుస్తోంద‌ని, ఇప్పటిదాకా కనీసం ఎస్సి కమిషన్ కూడా వెయ్యలేని తెలంగాణ ప్ర‌భుత్వ చిత్త‌శుద్దేమిటో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతోంద‌న్నారు.

సీఎం ..ఇప్పటివరకు అట్రాసిటీ కేసుల మీద కనీసం సమీక్ష కూడా చెయ్యలేదని, రాజకీయ రంగు పులిమి ఇతర పార్టీల మీద నెట్టడం క‌డియం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు ల‌క్ష్మ‌ణ్‌. రాష్ట్రంలో పార్టీల అధికారం మారుతోంది కానీ, విధానాలు మార‌డంలేద‌ని ఆయ‌న అన్నారు. కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌జా ఉద్య‌మాల‌తో దూసుకుపోతామ‌ని ఆయ‌న చెప్పారు.