ఏపీలో మరోసారి గ్యాస్ లీక్.. ఇళ్లని ఖాళీ చేయిస్తున్న అధికారులు !

విశాఖ గ్యాస్ లీక్ ఘటనని మరవకముందే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఐస్ ఫ్యాక్టరీ నుంచి అమోనియా గ్యాస్ లీకైంది. దీంతో చుట్టు ప్రక్కన ఉన్న ఇళ్ల ప్రజలకి ఊపిరి ఆడటం లేదు. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు పరుగులు తీస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకొన్నారు. 

ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న 200మీ ఇళ్లని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఫ్యాక్టరీలోని మూడు సిలిండర్ల నుంచి గ్యాస్ లీకవుతుందని తెలుస్తోంది. ఐస్ ని తయారు చేయడానికి వాడే ఈ అమోనియం లీకవ్వడంతో మరోసారి విశాఖ ఘటని గుర్తుకు తెచ్చుకొని ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు.