భారత్ లో లక్ష దాటిన కరోనా కేసులు

భారత్ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4970 పాజిటివ్ కేసులు నమోదుకాగా 134 మరణాలు సంభవించాయి. దీంతో మంగళవారం నాటికి దేశంలో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 1,01,139 చేరింది. వీరిలో ఇప్పటివరకు 3163 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం బాధితుల సంఖ్య 2474కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 50మంది చనిపోయారు. ఇక తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1597కి చేరగా ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ 4.0 కొనసాగనుంది. ఈ దఫా లాక్ డౌన్ లో ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తిరిగి తెరచుకోనున్నాయి.