ఎన్టీఆర్’తో సినిమా ప్రకటించిన ప్రశాంత్ నీల్ 

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఉండనుంది. పాన్ ఇండియా సినిమా రాబోతుందనే ప్రచారం చాన్నాళ్లు జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే తారక్ సినిమా ఉంటుందని చెప్పుకొన్నారు. ఇంతలో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఫిక్స్ కావడంతో.. ప్రశాంత్ నీల్ సినిమా ఉండదేమో అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఉంది. తారక్ బర్త్ డే కానుకగా ఆయనతో సినిమా ప్రకటన చేశారు ప్రశాంత్ నీల్.

“న్యూక్లియర్‌ ప్లాంట్‌ పక్కన కూర్చుంటే ఆ ఫీల్‌ ఎలా ఉంటుందో ఫైనల్‌గా నాకు తెలిసింది. నీ చుట్టూ ఉండే క్రేజీ ఎనర్జీకి నెక్ట్స్‌ టైమ్‌ నా రేడియేషన్‌ సూట్‌ని తీసుకువస్తాను. హ్యాపీ బర్త్‌డే బ్రదర్” అని ట్విట్ చేశారు ప్రశాంత్ నీల్. వీరి కాంబో సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ యేడాది చివరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2తో బిజీగా ఉన్నారు. అక్టోబర్ రావల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో ఆలస్యం అయ్యేలా ఉంది.