దారుణం : బావిలో 7 మృతదేహాలు

వరంగల్ లో దారుణం చోటు చేసుకుంది. నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు బయటపడ్డాయి. నిన్న నాలుగు మృతదేహాలు, ఇవాళ మరో మూడు మృతదేహాలు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు బావిలో ఉండటంతో హత్యలా ? సామూహిక ఆత్మహత్యాలా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. తొలుత కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబరు నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. మక్సూద్‌ (50), అతని భార్య నిషా(45), 22ఏళ్ల కుమార్తె, ఆమె మూడేళ్ల కుమారుడు మృతదేహాలు బావిలో తేలియాడడంతో హృదయాల్ని కలిచి వేసింది. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ??అన్నది తెలియాల్సి ఉంది. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.