హీరోయిన్ ని చంపేసిన సోషల్ మీడియా

పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జనావాసాల మధ్య కూలిపోవడంతో విమానంలో ఉన్న 99మంది చెందారు. ఈ విమాన ప్రమాదంలో పాకిస్థాన్ నటి అయేజా ఖాన్, ఆమె భర్త కూడా  మృతి చెందినట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. తన మరణ వార్తపై అయేజా ఖాన్ స్పందించారు. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దు. తాను, తన భర్త క్షేమంగానే ఉన్నామని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. దీంతో విమాన ప్రమాదంలో హీరోయిన్ మృతి అనే న్యూస్ ఫేక్ అని తేలిపోయింది. దీంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.