పవన్ తో బండి సంజయ్ భేటీ 

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని పవన్ వ్యక్తిగత కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. సుమారు గంట పాటు వీరి సమావేశం కొనసాగింది.
 
ఏపీలో భాజపాతో కలసి పనిచేస్తున్న జనసేన తెలంగాణలో కూడా కలసి పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పవన్, బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యం నెలకొంది. భాజపా వర్గాలు మాత్రం మర్యాద పూర్వక భేటీ అంటున్నాయి. ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు. తెలంగాణ భాజాపాకు జనసేన అవసరం లేదు. మరీ.. పవన్ ని పరోక్షంగా వాడుకొనేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది.