వలస కార్మికులకు నిధి సాయం

గ్లామర్ హీరోయిన్ నిధి అగర్వాల్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిధి తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పీఎం కేర్స్ ఫండ్‌, వెల్‌ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్‌, క‌రోనా క్రైసిస్ ఛారిటీ, స్పూర్తి సంక్షేమ సంఘంతో పాటు సీఎం రిలీఫ్ పండ్‌కు నిధి విరాళం అందించింది. తాజాగా వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేసింది.

స్పెష‌ల్‌గా త‌యారు చేయించిన  బ్రెడ్‌ని వలస కూలీల కోసం క‌వ‌ర్‌ల‌లో ప్యాక్ చేస్తోంది నిధి. దీనికి సంబంధించిన ఫోటోలని నిధి తన ట్విట్ట‌ర్‌ ఖాతాలో షేర్ చేసింది. సినీ కార్మికుల ఆకలి తీర్చాలన్న నిధి ప్రయత్నాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిధి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు  గల్లా అశోక్ ఎంట్రీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.