అమరవీరులకి నివాళులర్పించిన కేసీఆర్ 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిడారంబరంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌ చేరుకున్న ఆయన అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ భవన్‌లోలో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు.