పూరి లాక్ డౌన్ సప్రైజ్

దర్శకుడు పూరి జగన్నాథ్ లాక్ డౌన్ సప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన పూరి.. మూడ్నాలుగు కథలు రాసేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఓ కథ విక్టరీ వెంకటేష్ కోసం రాశాడట. అంతేకాదు.. వెంకీని కలిసి కథని కూడా వినిపించినట్టు తెలిసింది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయ్. ఈ ప్రాజెక్ట్ ఒకే అయ్యే ఛాన్స్ ఎక్కువని సమాచారమ్.

యంగ్ హీరోలు, సీనియర్ హీరోలని తనదైన శైలిలో ప్రజెంట్ చేయడం పూరి ప్రత్యేకత. ‘పైసా వసూల్’ సినిమా కోసం బాలయ్య ఎనర్జిని మొత్తం వాడేసుకున్నాడు. బాలయ్య అభిమానులకి కొత్త అనుభూతిని ఇచ్చారు. ఇప్పుడు వెంకీ కోసం.. తనదైన శైలిలో ఓ కథని రెడీ చేశారట. వెంకీ ఓకే అంటే.. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ బడ్జెట్ లో కానిచ్చేందుకు పూరి ప్లాన్ చేసినట్టు తెలిసింది.

ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. పాన్ ఇండియా సినిమా ఇది. ఇక వెంకీ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎఫ్ 2 సీక్వెల్ చేయాల్సి ఉంది. ఒకవేళ పూరి సినిమా ఓకే అయితే.. నారప్ప తర్వాత అదే సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.