పవన్ ఫ్యాన్స్.. ఓ బ్యాడ్ న్యూస్ !

‘వకీల్ సాబ్’తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కరోనా ఎటాక్ చేయకుంటే.. మే నెలలోనే ‘వకీల్ సాబ్’ వచ్చేసేవాడు. ఇంకో 35 రోజుల షూటింగ్ మిగిలి వుంది. ప్రభుత్వం నుంచి షూటింగ్ లకి అనుమతి రాగానే వకీల్ సాబ్ షూటింగ్ మొదలు కానుంది. పవన్ కూడా ముందుగా వకీల్ సాబ్ సినిమాని పూర్తి చేసి.. క్రిష్ సినిమా మొదలెడతానని చెప్పేశాడు. అయితే వకీల్ సాబ్ మిగిలి ఉన్న షూట్ కోసం 35 రోజులు పట్టనుంది.

ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో మూడ్నెళ్ల సమయం పట్టనుందని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పట్లో థియేటర్స్ తెరచుకొనే అవకాశాల్లేవ్. ఒకవేళ తెరచుకున్న జనాలు థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన షూటింగ్ పార్ట్ ని వేగంగా పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులని మాత్రం తాపీగా చేయాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ యేడాది వకీల్ సాబ్ రిలీజ్ కష్టమే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

బాలీవుడ్ హిట్ పింక్ కిరిమేక్ ఇది. ఇందులో అమితాబ్ నటించిన పాత్రలో పవన్  కనిపించనున్నాడు. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.