కరోనా కేసులు.. అది పెద్ద వన్డే జంప్ !

దేశంలో కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. మొదట్లో ప్రతిరోజు 2వేలకి పైగా నమోదైన కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమ కమంగా పెరుగుతూ వస్తున్నాయ్. ఇటీవల కాలంలో 5 వేల నుంచి 6వేలు.. అక్కడి నుంచి 8వేలకి జంప్ అయిన కరోనా కేసుల సంఖ్య.. బుధవారం ఒక్కరోజే 9వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,304 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. వన్డేలో నమోదైన అత్యధిక కేసులు ఇవే.
 
ఇక కరోనా మరణాల సంఖ్య 6వేలు దాటాయి. 6,075 మంది కరోనా కాటుకు బలయ్యారు. గురువారం ఒక్కరోజే  260 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఇప్పటి వరకు 1,04,107 మంది కరోనా నుంచ్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,06,737 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.