సీఎం జగన్ నివాసానికి కరోనా థ్రెట్

కరోనా మహమ్మారి సామాన్యుడు, సెలబ్రిటీ. బంటు, రాజు. పేద, ధనిక అనే తేడానే లేదు. అందరికి సోకుతుంది. తాజాగా ఏపీ సీఎం జగన్ నివాసానికి సైతం కరోనా థ్రెట్ ఏర్పడింది. జగన్ నివాసానికి చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. క్రిస్టియన్ పేట, ఎన్టీఆర్ కట్టపై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది.

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 141 కొత్త కేసులు నమోదయ్యాయ్. వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 43 ఉండగా.. రాష్ట్రంలో 98 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,112 కేసులు నమోదయ్యాయి. కరోనా మృతుల సంఖ్య 71కి చేరింది.